గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2020, బుధవారం

డా.దాశరథి జయంతి సందర్భముగా వారిని సంస్మరించుకొనుచు,

జైశ్రీరామ్.
డా.దాశరథి జయంతి సందర్భముగా వారిని సంస్మరించుకొనుచు,

వర తెలగాణ బిడ్డడయి భాసిలినట్టి మహాగ్నిధార, ధీ
వర మహితుండు దాశరథి, పాపుల పాలిట రుద్రవీణ, సు
స్థిర మహనీయ తేజము ప్రసిద్ధమహాద్భుత గ్రంథ రూపియై
వరలుచు నుండె నేడు. కవిభాస్కరమూర్తికినంజలించెదన్.

సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు. 
జైహింద్.
Print this post

1 comments:

Ravi Bhushan Sarma Konduru చెప్పారు...

కవి రారాజు నుంచి మరొక కవికి మంచి నివాళి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.