భాగవతమును తెలుగులో పద్య గద్య రూపమున అనువదించ బూనిన పోతన భాగవతమును పలుకుటను గూర్చి ఇలా చెప్పాడు.
ఆటవెలది:-
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైన తమ్మి చూలికైన.
విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేట పరతు.
భాగవతాన్ని గూర్చి తెలుసుకొనుట, దానిని గూర్చి పలుకుట ఈశ్వరునకైనను, బ్రహ్మకైనను, చాలా కాష్టము. అట్టి భాగవతాన్ని నేను విన్న దానిని చూచినదానిని, నాకు తెలిసిన దానిని తేట తెల్లము చేయుదును.
అంత కష్ట తరమని చెప్పుతూ చెప్పిన భాగవతమే యింత గొప్పగా మందార మకరంద మాధుర్యాలు నింపుకొన్నదీ అంటే పోతన మదిలో భాగవతం ఇకా ఎంతటి గొప్పగా అమృతోపమానమై నిలిచినదో కదా. అట్టి మహాకవి రచించిన తెలుగు భాగవతం వలన ఎందరు భక్తులు ముక్తినొందారోకదా. సమయం చిక్కినప్పుడల్లా మనం కూడా భాగవతాన్ని హృదయస్థం చెద్దామా.
జైహింద్.
Print this post
రాఘవ శతకము ఆర్కైవ్.కం లోను,స్క్రిబ్డ్ లోను ప్రకటించబడినవి. ఇది ఆలింకులు.
-
జైశ్రీరామ్.
రాఘవ శతకము ఆర్కైవ్.కం లో ప్రచురించారు. అలాగే స్త్రిబ్డ్ లో కూడా
ప్రచురించారు. ఆ లింకులు ఇచ్చుచుంటినండి
https://ia803409.us.archive.org/0/it...
6 గంటల క్రితం
వ్రాసినది












2 comments:
రామకృష్ణారావుగారూ బాధపడకండీ... ముద్రారాక్షసాలు సర్వసాధారణమే. పైగా మీరే చెప్తున్నారు కదా జాలానన్వయాలూ విద్యుదంతరాయాలూ ఉన్నై అని. మీ సుహృదయాన్ని మేము అర్థం చేసుకున్నాం :)
అయ్యా రామకృష్ణారావు గారు, మీరు మా బోటి వారికి చేస్తున్న సహాయం అనన్యం.
మోహన రావు పోడూరి
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.